మంచి మాటలు

I

II
ఒకసారి ఒక పిరికివాడు ఒక స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి...కొంచెం దూరంలో ఒక వ్యక్తి వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు... ఇంతకీ విషయం ఏమిటంటే..ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడు...కాని కేవలం వాడికి వీడు..వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.

నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే... నేను ఉన్నాను అనే భరోసా...ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్న అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో..ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.

పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారు అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో మేము ఉన్నాం అనే భరోసా కారణం...కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు..బంధువులు నీ చుట్టూ లేక పోవటం...

కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇద్దాం...అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేద్దాం..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.



III
HINDI DIWAS (SEPTEMBER 14)



जिंदगी के चार दिन
प्यार से गुजर दिन
अच्छे काम पे हाथ बढ़ावा
कार तू अपना दिल बड़ा
जो तेरा नुक्सान करे
दिल तेरा उनको माफ़ करे
मुश्किलों का सामना क़र
मुसीबत से कभी न डर
जिंदगी का इ समुन्दर
जो जीता वोही सिकंदर
आप सबको हिंदी दिवस की ढेर
सारे शुभ कामनाये


Zindagi ke char din
Pyar se gujaar din
Atche kaam pe haath badahKar 
thu apna dil badaJo 
tera nuksaan kare
Dil tera unko maaf kare
Mushkilon ka samna karMuseebat 
se kabhi na darJindagi ka e samundar
Jo jeetha vohi sikandarAap sabko hindi diwas ki dher sare shub kamnaye


लेखिका : श्रीमती रेगुलागड्डा वेंकटा लक्ष्मी गायत्री                        चोदवाराम ,




              विशाखापट्नम डिस्ट्रिक्ट
IV
భగవద్గీతను ఎందుకు చదవాలి? చదివితే ఏమి అవ్వుతుంది ?

ఒక పెద్దాయన రైతు..కొండలపైన ఉన్న తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్నారు. రోజూ పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటారు…మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం…తనూ అన్ని పనులూ తాతగారిలా చెయ్యాలనుకుంటాడు…


పొద్దున పూట తాత లానే తానూ భగవద్గీత  చదవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల అవ్వటం లేదు…ఒకరోజు తాతని అడిగాడు…తాతా.. నువ్వు చదివినట్టు నేనూ భగవద్గీత చదవాలని ప్రయత్నిస్తే…ఎంత చదివినా అర్ధం కావటం లేదు…కష్టం మీద కొంచెం అర్ధం చేసుకున్నా…పుస్తకం ముయ్యగానే..మర్చిపోతున్నాను.
అసలు భగవద్గీత ఎందుకు చదవాలి మనం..ఏంటి ప్రయోజనం…అని తాతని అడిగాడు మనవడు…పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడివైపు తిరిగి..తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్టని మనవడికి ఇచ్చి…కింద నది నుండి ఈ బుట్ట నిండా నీళ్ళు తీసుకుని రా..అని చెప్పారు…సరే తాత..అని మనవడు బుట్ట తీసుకెళ్ళి…నదిలో బుట్టను ముంచి కొండ పైకి ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు బుట్ట నుండి కారిపొయ్యాయి…అది చూసి తాతగారు…ఓరి మనవడా..ఇంకొంచెం వేగం పెంచు..ఇంటికి రావటం లో అని సలహా చెప్పారు…సరే అని ఈ సారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్ళు నింపి ఇంటికి వచ్చాడు మనవడు..బుట్ట ఖాళీ…తాతా..బుట్ట లో నీళ్ళు ఎలా నిలుస్తాయి…నేను గిన్నె తీసుకెళ్తాను అన్నాడు మనవడు..తాత చెప్పాడు…లేదు లేదు బుట్టతోనే నీళ్ళు తేవాలి..బహుశా నువ్వు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటా…ఇంకొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే పని అవ్వచ్చు..అని మనవడిని ప్రోత్సహించారు.

మనవడు ఈ సారి ఇంకా వేగంగా నదిలో బుట్టను ముంచి..బుట్టలో నీళ్ళు నింపి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు…బుట్టలో నీళ్ళు నిలవలేదు…మళ్ళీ వెంటనే ఇంకోసారి కూడా ప్రయత్నించాడు…అయినా ఫలితం మాత్రం అదే…తాతగారు మనవడి కష్టం అంతా కిటికీలోంచి చూస్తూనే వున్నారు….ఖాళీ బుట్టతో ఆయాసపడుతూ నించున్న మనవడితో నవ్వుతూ చెప్పారు..ఒకసారి బుట్ట వైపు చూడు మనవడా…అని…మనవడు బుట్టను చూసాడు…నల్లని బొగ్గుల బుట్ట ఇప్పుడు చాలా శుభ్రంగా, తెల్లగా ఉంది.తాతగారు చెప్పారు…భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే…మనకు అర్ధం అవ్వనీ అవకపోనీ…గుర్తు ఉండనీ ఉండకపోనీ…చదివే సమయంలో మనకు తెలియకుండానే..మన ఆలోచనల్లో..మన దృక్పధం లో మంచి మార్పు వస్తూ ఉంటుంది…ఆ మార్పు మనకి వెంటనే తెలియదు కూడా…సందర్భాన్ని బట్టీ..అవసరమైన సమయం లో..ఆ మంచి మార్పు…ఉపయోగపడుతుంది…భగవద్గీత చదవటంలో కృష్ణుడు మనకు చేసే మేలు అదే…మన మనస్సులను శుభ్రపరచటం…ఏది ఏమిటో…ఏది ఎందుకో…సరైన అవగాహన మనకి తెలియచేయటం…ఇవన్నీ అనుభవపూర్వకంగా..ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు….అని చెప్పి మనవడి ప్రశ్నకు సహేతుకంగా, ఉదాహరణతో సహా వివరించారు తాతగారు.

V

ఒకసారి, తన కుటుంబం తో ఒక మహిళ టూర్ కు వెళ్లి అక్కడ ఒక త్రీస్టార్ హోటల్ లో బస చేసింది.. ఆ మహిళ ఒక ఆరు నెలల పాపకు తల్లి.పాప పాల కోసం ఏడుస్తుంటే ఆ మహిళ త్రీస్టార్ హోటల్ మేనేజర్ వద్దకు వెళ్లి " దయచేసి ఒక కప్పు పాలు ఇవ్వగలరా? " అని అడిగింది."తప్పకుండా మేడమ్" అని ఆయన బదులిచ్చారు." కానీ మేడమ్ మా హోటల్లో ఒక కప్పు పాలు 100 రూ॥ మేడమ్!""పర్వాలేదు ఇవ్వండి!" అని ఆ మహిళ పాలు తీసుకుని పాపకు త్రాగించింది.కొంత సమయం తర్వాత వారందరు అక్కడి ప్రదేశాలను చూడడానికి కారులో బయలుదేరారు.మధ్యలో పాప ఆకలితో పాల కోసం ఏడుస్తుంటే...వారు ఒక రహదారి ప్రక్కన ఉన్న టీ స్టాల్ వద్ద కారును ఆపుకున్నారు. ఆ టీ విక్రేత వద్ద ఒక కప్పు పాలు తీసుకుని పాపకు పట్టింది.
తరువాత "ఎంత?"  అని ఆమె టీ స్టాల్ వ్యక్తిని అడిగింది."మేడమ్! మేము చిన్న పిల్లల పాలకు డబ్బు వసూలు చేయం" అన్నాడు టీ స్టాల్ వ్యక్తి నవ్వుతూఎంత బలవంతపెట్టినా డబ్బులు తీసుకోలేదతను. అంతే కాదు ప్రయాణంలో పాపకు అవసరమౌతాయని మరో కప్పు పాలు పోసి ఇచ్చాడు.ఆ మహిళ కారులో కుర్చున్న తరువాత ఆలోచించసాగింది.నిజంగా ఎవరు ధనవంతులు ? త్రీస్టార్ హోటల్ నిర్వాహకుడా? లేక టీ స్టాల్ విక్రేత నా?ధనవంతత్వం ఎక్కడ ఉంది?
మనస్సులోనా?గుణం లోనా??లేక దాచుకున్న డబ్బుకట్టలు - సంపదలలోనా???చాలా సార్లు మనమందరం డబ్బు సంపాదన యావ లో పడి మనుషుల మన్న సంగతి మర్చిపోతుంటాము.కాని ఇలాంటి అనేక సందర్భాలలో " తిరిగి ఏదో ఆశించకుండా చేసే చిన్న చిన్న సహాయాలు " డబ్బు ఇచ్చే కిక్ కన్న ఎన్నో రెట్లు అధికంగా మంచి అనుభూతిని ప్రసాదిస్తాయి.              


VI

మాట మీద నిలబడటం వేరునిలబడే మాట పలకడం వేరు     
చెప్పింది చేయడం వేరు
చేసేది చెప్పడం వేరు
                        మొదటిది నిబద్దత
                        రెండవది పారదర్శకత
ఇతరుల మీద గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
                       మొదటిది తంత్రం
                       రెండవది తత్వం
ఎంత దూరమైనా వెళ్ళడం వేరు
ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
                       మొదటిది సాహసం
                       రెండవది వివేకం
ఎలాగైనా చేయడం వేరు
ఎలా చేయాలో తెలిసుండటం వేరు
                       మొదటిది చొరవ
                       రెండవది నేర్పు
ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు
ఇతరుల కోసం పిడికిలి బిగించడం వేరు
                       మొదటిది నింద నీడన అస్తిత్వం
                       రెండవది నీడ వీడిన చైతన్యం
గెలవడం వేరు
గెలిపించడం వేరు
                       మొదటిది నేను
                       రెండవది మేము
సంఘం కట్టడం వేరు
సంఘటితం అవ్వడం వేరు
                       మొదటిది వ్యూహం
                       రెండవది చైతన్యం
మొదటిది కావాలో...
రెండవది కావాలో ఆలోచన మనదే ...
ఆచరణా మనదే ...
                

VII



*మనసుకు హత్తుకున్న విషయం !*

🙏🙏🙏💐💐🙏🙏🙏

ఆ దంపతులిద్దరినీ చూసి, పీఏ ముఖం చిట్లించుకుంది. ముతక వస్త్రధారణలో ఉన్న ఆ ఇద్దరు వృద్ధులను, ప్రెసిడెంట్ దగ్గరికి పంపడానికి ఆమె అంగీకరించలేదు. లేకపోతే, ఈ ముసలివాళ్ళకు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ తో పనేమిటి ?

ఇంతలో ఆ అధ్యక్షుడే గదిలోంచి బయటకు వచ్చాడు......

"చెప్పండి ,ఏం కావాలి? "అడిగాడు ప్రెసిడెంట్. 
"మేము విరాళం ఇద్దామనుకుంటున్నాము" చెప్పాడు ముసలాయన.......

ఆయనకు నమ్మకం కలగలేదు. అయినా బయటపడకుండా "ఎంత ఇవ్వాలను కుంటున్నారు?" అన్నాడు......

"మా పదహారేళ్ళ కొడుకు టైఫాయిడ్ తో చనిపోయాడు. వాడి ఙ్ఞాపకార్ధం ఈ యునివర్సిటీ క్యాంపస్ లో ఒక భవనం నిర్మించాలని మా ఆశ " చెప్పంది వృద్ధురాలు......

"బిల్డింగ్ కు ఎంతవుతుందో తెలుసా?" ప్రశ్నించాడు ప్రెసిడెంట్......

"ఎంత ?" చాలా మామూలు గా అడిగాడు ముసలాయన......

చెప్పాడు ప్రెసిడెంట్....

ముసలాయన ఆశ్చర్యపోయాడు.....

ముసలావిడ కూడా ఆశ్చర్యపోయింది.
"అంటే ఈ లెక్కన ఓ యూనివర్సిటీ స్థాపించాలంటే ఎంతవుతుంది?" కుతూహలం ఆపుకోలేక అడిగింది పెద్దావిడ.......

ఆ పెద్ద మొత్తాన్ని ఒక్కొక్క పదమే నొక్కి చెప్పాడు ప్రెసిడెంట్........

ఆమె , భర్త వైపు తిరిగి అంది, "మరి మనమే ఓ యూనివర్సిటీ ఎందుకు పెట్టకూడదు డార్లింగ్ !" 
"సరే" అన్నాడు భర్త.....

కొంతకాలానికి కాలిఫోర్నియా నగరంలో "స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ" స్థాపన జరిగింది.....
ఆ దంపతులిద్దరూ లేలాండ్ స్టాన్ ఫోర్డ్, జేన్ స్టాన్ ఫోర్డ్........

లేలాండ్ కాలిఫోర్నియా గవర్నర్ గాను, సెనేటర్ గానూ పని చేశారు......

ఒక్కోసారి మనం ఎదుటివాళ్ళను ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఎదుటివాళ్ళ దుస్తులను బట్టి,కాళ్లకు వేసుకున్న చెప్పులను బట్టి, ప్రయానించిన వాహనాన్ని బట్టి మనం వాళ్ళ స్థాయిని లెక్కగడుతుంటాం.......

*రేప్పొద్దున మీ ఎదురుగా నిలబడి ఉన్నది, ఎవరైనా సరే కావచ్చు.... వాళ్ళను మీకంటే గొప్పవాళ్ళుగా భావించకపోయినా సరే, తక్కువవాళ్ళని మాత్రం అనుకోవద్దు.......*


VIII



ఈ పోస్ట్ పార్వతీపతి. దుర్వాసుల గారు పోయిన సంవత్సరము పంపినది.

స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను 

పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. రెండూ 

గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల 

ఆగిపోయిందికాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు 

అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, 

విపరీతమైన గాలివాన, వర్షం..దానితో ఈ వాతావరణంలో ముందుకు 

సాగలేకఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే 

చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు. కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న 

ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ 

డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు 

లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి 
తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన 
చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె 
గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం 
లేదు. ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు 
ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. ఆ 
ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు 
ఒక్కటి తప్ప,ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.ఆమెకు 
అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత 
సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది."ఈ 
ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. 
ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క 
స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా 
దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం 
గడిపేస్తున్నానుఅని చెప్పింది. వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు."భగవంతుడు 
దయామయుడు. ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే 
తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి, గాలివానలో చిక్కుకుని, నేను మీ ఇంటికి 
వచ్చాను. కాదు కాదు, ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ 
డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు. అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన 
అవార్డు అతనికి గుర్తు రాలేదు.ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు 
కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే.1.అడగడం, 2. నమ్మడం, 
3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు. భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే, 
మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు.


IX


శ్రీమతి రేగులగెడ్డ వెంకట లక్ష్మీ గాయత్రి వ్రాసిన 

వ్యక్తిత్వ వికాసం-పెద్దల మాటలు 

"పెద్దల మాట చద్దన్నం మూట" ఇది మీరు వినే ఉంటారు. ఇప్పుడు చద్దన్నం మీద ఆసక్తి ఎలాగైతే ఉండడం లేదో అలాగే పెద్దల మాటల మీద కూడా ఆసక్తి ఉండడం లేదు.ఏం వింటాం సోది అనేవారు కూడా ఉన్నారు.క్షమించాలి.
ఒకప్పుడు అంటే మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు నులకమంచం మీదో,పట్టెడ మంచం మీదో కూర్చుని ఎవరొచ్చినా ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు?ఎవరి తాలుకా అని అడిగేవారు.మనం జవాబు చెపితే తెలిసిన వాళ్ళయితే మీ తాత ఎలా ఉన్నారనో,మీ అత్త ఒంట్లో బాగుందా అనో అడిగేవారు.
విసుగనిపించినా వినండి.అల్జిమీర్స్ రోగానికీ నేను చెప్పేదానికీ సంబంధం ఉందని పూర్తగా విన్నాక మీకు అనిపిస్తుంది.
సైకాలజీ లో రీకాల్,రికగ్నిషన్ అనే పదాలున్నాయి.అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం,గుర్తించడం.
ఎంత చేయి తిరిగిన వంటకత్తెలయినా ఒకసారి పెద్దావిడ ఇంట్లో ఉంటే పాఠోళీ ఎలా చేయాలని అడిగి చూడండి.ఆవిడ ముఖం వెలిగిపోతుంది.మనకి ఏమీ రాదన్నట్లు శనగపప్పు నానబెట్టడం దగ్గరనుంచీ చెప్తుంది.ఆ వంట ఎవరెవరికి ఇష్టమో చెపుతుంది.కొసరుగా కావాలంటే పెసరట్ల కూర కూడా ఎలా చేయాలో చెపుతుంది.అదే రీకాల్ అంటే.
జీవ పరిణామ సూత్రాలలో ఉపయుక్త,నిరుపయుక్త సూత్రం అని ఉంది.అంటే దేని ఉపయోగం ఉంటుందో అది కొనసాగుతుంది.పని లేనిది క్రమంగా అవశేషంగా ఉండిపోతుంది.మన శరీరంలో ఉండుకము (అపెండిక్స్)అనే భాగం ఉంది.పూర్వం మనుషులు పచ్చి మాంసం తినే రోజుల్లో జీర్ణక్రియలో ఉండుకము పాత్ర చాలా ఉండేదట.నాగరికతలో మార్పులు వచ్చి ఉడికించుకుని తినడం మొదలుపెట్టాక ఉండుకము ఉపయోగం లేక క్షీణించిపోయిందట.మన మెదడుకి కూడా రోజూ తగినంత పని చెప్పకపోతే అదీ క్షీణించిపోతుంది.వాడని,బళ్ళు,ఎలక్ట్రానిక్ వస్తువులూ మెకానిక్ షాపుకి వెళ్ళినట్టు.
ఇంకొక భాగం మోకాలు.బోడి గుండు(మెదడు)కీ మోకాలుకీ ముడిపెడుతున్నాననుకోకండి.ఇప్పటి పిల్లలు ఇంట్లో మంచాల మీద,సోఫాలమీద,డైనింగు టేబుల్ వాడుతూ కుర్చీలమీదకూర్చుని భోజనం చేస్తున్నారు.
పాఠశాలల్లో కూడా క్రింద కూర్చునే పని లేదు.క్రమంగా మోకాలు మడిచే అవసరం తగ్గిపోతోంది.అందరికీ మోకాలి నొప్పులే.పిల్లలకి క్రింద మఠం వేసుకుని కూర్చోవడం అలవాటు చేయాలి.ఇక మెదడు విషయానికి వస్తే మగవారు రిటైర్ అయ్యాక సందర్భాన్ని బట్టి వారు పని చేసే చోట జరిగిన విషయాలల చెపుతారు.మావారి తండ్రి మా తాతగారు హైస్కూల్ హెడ్మాష్టరు గారు.ఆయన పని చేసిన చోట్ల 10తరగతి పరీక్షల్లో స్లిప్పులు పెట్టనివ్వలేదని కొట్టడానికి వచ్చారని,డబ్బులు తీసుకుని అటెండెన్స్ వేయలేదని,ఆయన సిన్సయారిటీకి తరచూ ట్రాన్సఫర్లేనని మాతో చెపితే తాతగారి వీరగాధలు అని వినేవాళ్ళం.మా పాప పుట్టేసరికి ఆయన మంచానికి పరిమితం అయ్యారు.పాప ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి హుషారుగా ఉంటే కధలు చెప్పేవారు.వివాహ భోజనంబు,అయ్యయ్యో బ్రహ్మయ్య ఇలా పాటలు పాడేవారు.ఒకపూట ఆయన గదిలోకి వెళ్ళకపోతే పిల్ల కనబడలేదు అని అడిగేవారు.మా పాప తాతకి చేయి తుడుస్తా,భోజనానికి ముందు కాళ్ళు కడుక్కోవడానికి లేవలేక కాళ్ళపైన నీళ్ళు చల్లమనేవారు.మా పాప ఆ పని నేనూచేస్తాను అనేది.ఏమి పెట్టినా తాతా మీకు ఇది పెట్టేరా అని ఆడిగేది.ఆయన సంతోష పడేవారు. మనం పెధ్దవారికి ఏమి పెట్టినా వారు తిని అరిగించుకోలేరు.వాళ్ళకి మాట్లాడే వారూ,వాళ్ళ మాటలు వినే వారూ కావాలి.
మా నాయనమ్మ పురాణం ఫ్రెండ్స్ ఇద్దరు మామ్మగార్లు.రాజుల మామ్మగారు(ఆవిడని అలాగే పిలుస్తారు),రాజేశ్వరమ్మ గారు.మా మామ్మగారు బి.పి.పెరిగినప్పుడల్లా సొంతింట్లో చచ్చిపోతాను అక్కడ దింపమనేవారు.రిక్షా తీసుకుని వచ్చి 3కి.మీ.దూరంలో ఉన్న సొంతింటికి మా అన్నో,నేనో దింపేవాళ్ళం.మాది ఫ్యాక్టరీ క్వార్టర్ కావడం వల్ల చెడ్డ సమయంలో చనిపోతే మేము క్వార్టర్ లో ఉండడం ఇబ్బంది అవుతుందని ఆవిడ భయం. మరల 2,3రోజూల్లో తిరిగి వచ్చేసేవారు.ఈలోపు నాకు సెలవులొస్తే మామ్మగార్లు నన్ను పురాణం చదవమనేవారు.మా అమ్మ నీకు భలే ఫ్రెండ్స్ దొరికారని నవ్వేది.ఏమి కష్టం వచ్చినా నీకెలా చెప్తారే నువ్వు పెద్ద పేరక్కవా అనేది.వింటే ఎందుకు చెప్పరు?రాజేశ్వరమ్మగారయితే కంట్లోమందు గాయత్రమ్మే వేయాలనేవారు.మామామ్మగారికి నేను జాగ్రత్తగా చేసేదాన్నని నమ్మకం.ఒంట్లో బాగుందా అని అడగడం,వాళ్ళు చెప్పేది వినడం అంతే మనం చేయవలసినది వాళ్ళకి కావలసినది.
మా నాయనమ్మగారి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ.ఆవిడ జాతకాలు చెప్పేవారు.ఒకసారి వచ్చినవారు మరల వస్తే వారు చెప్పకుండానే వాళ్ళ వివరాలన్నీ చెప్పేవారు.ఆవిడ మాకు పద్యాలు,శ్లోకాలూ,కథలా చెప్పేవారు.ఆమె దగ్గరకి మా ఇంటి ప్రక్కన ఉండే మామ్మగార్లు భాగవతం,భారతం వినడానికి వచ్చేవారు.
మాకు 8వ తరగతిలో తెలుగు పాఠం చాటువులు అని ఉండేది.
అందులో భార్యా భర్తల వెటకారాలపై పద్యాలు ఉన్నాయి.
పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి విరోధి
అన్నపెండ్లాము అత్తను కన్నతండ్రి
ప్రేమ తోడున కన్నట్టి పెద్దబిడ్డ
సున్నమిప్పుడు తేగదే సన్నుతాంగి
భార్య జవాబు
శతపత్రంబులమిత్రుని సుతు
జంపినవానిబావ సూనుని మామన్
సతతము దాల్చెడినాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో
ఈ పద్యాలున్నాయని చెబితే అర్ధం తెలుసుకుని నేర్చకున్నారు.
ఆవిడ పురాణం స్నేహితురాళ్ళకి కూడా చెప్పారు.అప్పటికి ఆవిడకి87ఏళ్ళ పైనే.ఆవిడ 103సంవత్సరాలు బ్రతికారు.
ఇంక చనిపోయే ముందు నా జ్ఞాపకశక్తి పోతే నేను పోతానని అర్థం అని చెప్పి ఈ పద్యాలు పాడి తప్పులు లేవు కదా అని నన్ను అడిగేవారు.2రోజుల్లో చనిపోతారనగా ఎప్పుడూ నాన్నయ్యా అని పిలిచే మా నాన్నగారిని ఎవరునేనని అడిగితే అమ్మలు(మా అమ్మగారు)మొగుడు అన్నారు.
మాకు తెలిసిపోయింది సమయం లేదని.
నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే మెదడుకి పని ఉంటే ఏ అల్జీమీర్స్ రాదు.
మగవారు ఉద్యోగానికి వెళ్ళినన్నాళ్ళు చాలా హుషారుగా వుంటారు.రిటైర్ అయిన తరువాత నెమ్మదిగా నన్ను పట్టించుకోవడం లేదు అనే భావన మొదలవుతుంది.
ఉద్యోగం చేసే ఆడవారికి రిటైర్ అయినా వంట ఇంటి పనికి రిటైర్ మెంట్ ఉండదు కాబట్టి వారికి ఆ ఇబ్బంది ఉండదు.
మగవారు రిటైర్ అయ్యాక ఇన్నాళ్ళూ కష్టపడ్డాను కదా అని ఏదో వ్యాపకం పెట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు.
ఇక్కడ మనం జీవ పరిణామ సూత్రములు తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకోవాలి.
ఈ మధ్య మనం తరచుగా వ్యక్తిత్వ వికాసం గురించి వింటున్నాము. వాటి కోసం ఫీజులు కట్టి తరగతులలో చేరుతున్నారు యువత. వారి పెద్దవారి అనుభవాలనుంచి మనం వ్యక్తిత్వపు పాఠాలు నేర్చుకోవచ్చు.
మా నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీలో మేనేజింగ్ డైరెక్టర్లకి పి.ఎ.గా పని చేసారు.అప్పట్లో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఐ.ఎ.ఎస్.ఆఫీసర్లు వచ్చేవారు.ఒకొక్కరితోనూ ఒక కొత్త ఇబ్బంది.మా నాన్నగారు భోజనం చేస్తూ మాతో చెపుతూ ఉండేవారు.
Boss is always right.యజమాని చెప్పందే వేదం,ఎందుకంటే జీతం ఇస్తాడూ కదా.తప్పన్నా,తిరగబడినా ఏదో వంకతో మనల్ని ఇబ్బంది పెడతాడు.
మహాకవి ధూర్జటి అన్నారిలా
రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు
వారిచ్చు నంభోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదుల్
ఆత్మ వ్యథా బీజంబుల్ అన్నారు.
అప్పుడు రాజే బాస్ కదా.
అలాగే ఆడపిల్లలు సాధారణంగా అత్తవారింటిలో ఎదుర్కొనే సమస్యలు మన నాయనమ్మలు,అమ్మమ్మలు ఇట్టే తీర్చస్తారు.ఇప్పుడు ఇంటికి ఇద్దరే పిల్లలు.ఆ కాలంలో ఆడపడుచులూ,మరుదులూ,పిన్నత్తగారూ,పెద్దత్తగార్లూ ఇలా ఎంతో మంది ఉండేవారు.వాళ్ళ వెటకారాలూ,సాధింపులూ మొరటు గానే ఉండేవట.
అవన్నీ భరిస్తూ,వాళ్ళకి చాకిరీ చేసేవారట. భర్తలు ఇప్పటిలా అంతేగా అనేవారు కాదట.మన గురజాడ వారి కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు గారిలా ఉండేవారట. ఇంక వీరికి తోడుగా ఉయ్యాల్లో బిడ్డ,కడుపులో బిడ్డ అన్నట్లు పిల్లలూ.అమ్మో చదివితేనే ఆయాసం రావడం లేదూ.పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా ఎలా యుధ్ధం చేసేవారో పాపం.
ఆ అనుభవమే ఇప్పటి పిల్లలు మనస్పర్ధలతో విడిపోకుండా కాపాడుతుంది.చంటి పిల్లలని ఎలా సాకాలో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో గూగుల్ సెర్చ్ లో దొరకదు. పెద్దవాళ్ళ దగ్గరే దొరుకుతుంది సమాధానం.మొన్న ఒక లేడీ డాక్టరు గారు అడిగారు నన్ను పురిటి పత్యం ఎలాగని.పాపం వాళ్ళ అమ్మగారికి తెలియక అన్నీ పెట్టేసారట. ఇప్పుడు వాళ్ళ పాపకి సెరిలాక్,నెస్టమ్ కాకుండా ఇంట్లో బియ్యం,పప్పు వేయించి వాము వేసి పొడి చేసి ఉడికించి పెడుతున్నారు.
సుడోకు,పదపూరణం చేయాలన్న సలహా చాలా మంచిది.కానీ ఆసక్తి ఉన్నవారికి.
ఆసక్తి లేని వారికి అవి చేయరూ కదా.మున్నాభాయ్ M.B.B.S. సినిమాలో క్యారమ్స్ ఆట మీద ఆసక్తి ఉన్న ముసిలాయన చేత కూల్ డ్రింక్ తాగించిన భాగం చూసాము కదా. మా అత్తగారికి ఇప్పుడు87సంవత్సరాలు.ఆవిడకీ ఎవరూ ఇంటికి రావడం పెద్దగా ఇష్టం వుండదు.ఆవిడకి సంగీతం వచ్చు. పాడమంటే నాకు గుర్తు లేదనేవారు.మా పాపకి సంగీతం నేర్పటానికి టీచరు గారు ఇంటికి వస్తే ముందు గొణుక్కున్నారు.మా వారు నీకు ఇబ్బంది అయితే ఆవిడ వెళ్ళేవరకు నీ గదిలో కూర్చో అమ్మా అన్నారు.2రోజులు లోపల కూర్చున్నారు. తరువాత నెమ్మదిగా తొంగి చూడడం మొదలుపెట్టారు.మేము చూసీ చూడనట్టు ఊరుకున్నాం.
తరువాత సోఫాలో కూర్చుని తాళం వేయడం మొదలుపెట్టారు.టీచరు గారు ప్రోత్సహించి పాట పాడమన్నారు.అప్పటినుంచి ఖాళీగా ఉన్నప్పుడు పాటలు గుర్తు తెచ్చుకొని పాడడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇవన్నీ అనుభవ పూర్వకంగా తెలుసు కున్నవి.
ఇందులో కొన్ని మాటలు ఐనా కొందరికైనా పనికి వస్తే నా ఈ ప్రయత్నం సఫలమైనట్లే.
శుభం

--------------------------------------------------------------------------------------------



సాయ్ ఇతనా దీజీఏ జామే కుటుంబ సమాయే
మై భీ భూకా నా రహుం సాధు న భూకా జాయ్

నా కుటుంబం,నేను బతకడానికి,నా ఇంటికి వచ్చిన సాధువుల కు అతిథులకు పెట్టడానికి తగినంత ధనం మాత్రం ప్రసాదించమని కబీర్ భగవంతుడిని కోరుతున్నారు.మనం కూడా అంతే ఆశించాలని దీని భావం.

బై శ్రీ మతి రేగులగెడ్డ వెంకట లక్ష్మీ గాయత్రి

---------------------------------------------------------------------------------------------------------------------------------

శీర్షిక: బ గుణింతపు మాటలు
బ:బలం
సంతోషం సగం బలం
ఐకమత్యమే మహా బలం
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలు కాదు.

బా:బాధ్యత
ఏ పని అయినా బాధ్యత వహించి నపుడు చక్కగా చెయ్యాలి.
పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత
బి: బిరుదు
జాతిపిత,ఉక్కు మనిషి,ఆంధ్రకేసరి,లోకమాన్య
ఇవన్నీ బిరుదులే ఎవరెవరికో తెలుసుకదా
బీ:బీగం
అంటే తాళం.ఇంటికి బీగం వేసి ఉంది అంటారు.
ఇది గమనించారా
ఇంటికి తాళం వేసి ఉంది అంటారు కానీ కప్ప వేసి ఉంది అనరు ఎవరూ.ఎందుకోమరి
బు:బుద్థి
బుద్ధికి బృహస్పతి అంటారు.
బుద్ధి మంచిదైతే సిద్ధి కూడా కలుగుతుంది.
బూ:బూడిద
శివుడు పూసుకునే భస్మానికి ఇంకో పేరు.
నా దగ్గరేముంది బూడిద అంటారు పిసినారులు.
బృ:బృహన్నల
అర్జునుడు.కాని కాలంలో శాపమే వరమై కాపాడింది అర్జునుడిని
బృహత్కధ:పైశాచీ భాషలో గుణాఢ్యుడు రాసాడట.
బె:బెల్లం
పంచదారకి బదులు ఇది వాడితే మంచిది.
బెల్లం చుట్టూ ఈగలు మూగుతాయి.వాటికి ఆరోగ్యం మీద ఎంత శ్రధ్ధో
బే:బేరం
ఆడవాళ్ళ బేరమాడందే ఏదీ కొనరంటారు.
భలే మంచి చౌక బేరము పాట విన్నారా?
బై:బైరాగి
సన్యాసికి మరో పేరు
బొ:బొమ్మ
బొమ్మని చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక పాట విన్నారుకదా
నాణానికి ఒకవైపు బొమ్మ ఇంకొకవైపు బొరుసు.
బో:బోధన
అంటే నేర్పడం అన్నమాట.
బం: బంగారం
బంగారం ఎంతగొప్ప లోహం అయినా రాగి కలపనిదే నగ తయారుకాదు.మీరు ఎంత తెలివైన వారైనా ఎవరి సాయం లేకుండా అన్ని పనులూ చేసుకోలేరు.
బంగారం నేలనుంచి తీసినపుడు బాగుండదు.దానిని శుభ్రం చేసి కొలిమిలో కాల్చి సుత్తితోకొట్టి సాగదీసి చక్కని ఆభరణం గా మారిస్తే అబ్బో అనేలా తయారవుతుంది.
పిల్లలు కూడా ఉపాధ్యాయుల చేతిలో అలాగే మెరుగుపెట్టబడి మంచి పౌరులుగా తయారవుతారు.
శుభం

శీర్షిక: ద గుణింతం
ద:దయ
జీవులన్నిటి పట్ల దయ కలిగి ఉండాలి.
దా:దానం
దానగుణంలో కర్ణుడు,శిబి చక్రవర్తి,రంతిదేవుడు చాలా గొప్పవాళ్ళు. మనం వారిని చూసి మనకి కలిగిన దానిలో కొంతైనా దానం చేయడం నేర్చుకోవాలి.
ది:దిక్కు
మనకి దిక్కులు నాలుగు.తూర్పు,పడమర,ఉత్తరం,దక్షిణం.దిక్కులు చూపే సాధనం దిక్సూచి.
ఇబ్బందులలో దిక్కు తోచని వారికి దేముడే దిక్కు.
దీ:దీపం
తాను మండుతూ పది మందికి వెలుగును పంచుతుంది.ఇంటికొక్క దీపమున్న ఇల్లంతా వెలుగు.పది మందికి నీ వెలుగును పంచేలా మెలగు.
దు:దురాశ దుఃఖానికి చేటు.సుయోధనుడి దురాశే దుర్యోధనుడిగా మార్చింది.కౌరవ వంశాన్నే కూల్చింది.
దూ:దూరం
దూరపు కొండలు నునుపు. అని భావించి ఎక్కబోతే వస్తుంది అలుపు.ఆనక కాళ్ళు సలుపు.రాళ్ళూ ముళ్ళూ గుచ్చుకు నీ దుమ్ము దులుపు.
దృ:దృష్టి
ఏ పనైనా చేసేటపుడు దానిపై దృష్టి పెట్టి చేయాలి,పరధ్యానంగా కాదు.
దూరదృష్టి కూడా కలిగి ఉండాలని పంచతంత్రం చెపుతుంది.
దె:దెబ్బ
ఇది వంటికీ తగులుతుంది,మనసుకీ తగులుతుంది.వంటికి తగిలితే తగ్గుతుంది,మనసుకి తగిలితే మానదు.ఎవరి మనసుకీ దెబ్బ తగిలేలా ప్రవర్తించవద్దు.
దే:దేశం
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
దేశమును ప్రేమించుమన్నా,మంచి అన్నది పెంచుమన్నా
దే:దేముడు
ఇందుగలడందులేడని సందేహము వలదు,అవసరం లేనపుడు కనబడడు,అవసరమైతే ఆగడు.
ఆపదలో ఉన్నవారిని ఆదుకొని చూడు,నీవే దేముడివి.
దై:దైత్యులు
అంటే రాక్షసులన్నమాట.దైత్యులను దృంచగా దైవమవతరించు.
దొ:దొర
యజమాని.
మొరవిని పాలించే దొర దేముడు.
దొంగల్లో కూడా దొరలూన్నారండోయ్.
దో:దోమ
చిన్నదైనా దీని వల్ల మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ,చికున్ గున్యా
అయ్యబాబోయ్ ముందు దోమలు కుట్టకుండా జాగ్రత్త పడండి.
దౌ:దౌత్యం
మన కృష్ణుడు పెద్ద దౌత్యవేత్త అండీ బాబూ, అంటే రాయబారి అని.
మన దేశానికి ప్రతీ దేశంలోనూ దౌత్య కార్యాలయాలున్నాయి
దం:దండం
అంటే నమస్కారం,దండించడం అనే అర్థాలున్నాయి.
దండం దశగుణం భవేత్ అంటారు.
మంత్రదండం అంటే మంత్రాల కర్ర
ఇంక నీకో దండం అనకండి. ఆపేస్తున్నా.

న గుణింతం

    న:నమస్కారం
     పెద్దలు ఎదురుపడితే నమస్కరించుట మన సంస్కారం.హాయ్ అనకండి

నా:నాయకత్వం
  అందరూ నాయకులు కాలేరు.మనం ఎంచుకున్న దారి మంచిది కావాలి.పదిమందికి మార్గం చూపించాలి.
 
ని:నిరాశ
  దురాశ లాగే నిరాశ మంచిది కాదు.ఆశ తోనే ప్రపంచం నడుస్తుంది.పది మంది నిరాశావాదులుంటే అక్కడనుంచి పారిపొమ్మన్నారొక కవి.
నీ:నీరు
  నీరు లేకపోతే మీరూలేరు,మేమూ లేము.మన శరీరంలో నీటి శాతం ఎలా తగ్గకూడదో బయట కూడా అలాగే తగ్గకూడదు.జలవనరులు వృధా చేయకండి.

ను:నువ్వులు
   దానంగా ఇస్తే శనిదోషం పోతుంది.తింటే కాల్షియం లభిస్తుంది.బాలింతలకి తప్పకుండా నువ్వులనూనె తినిపించేవారు శరీరం గట్టి పడుతుందని.
నూ:నూకలు
మనకీ,కోళ్ళకీ కూడా కావాలి.నూకలు ఉంటే మనం ఉంటాం .నూకలు చెల్లితే అంతే.

నృ:నృపుడు
   అంటే రాజు.రాజు తలుచుకుంటే దెబ్బలకే కాదు దేనికీ కొదవుండదు.

నె:నెల
తెలుగు నెలలు12.ఇంగ్లీషు నెలలు కూడా12కానీ ఇంగ్లీషు వారి మొదటి నెల వచ్చేసరికి తెలుగు నెలలు సుమారుగా 9పూర్తి అవుతాయి.

నే:నేర్పు
 ఏ పని ఐనా నేర్పుగా చేయాలి.ఒకరిని ఒప్పించడానికి కూడా నేర్పు కావాలి.
బోధించడాన్ని కూడా నేర్పించడం అంటారు.

నై:నైపుణ్యం
ఇది 4వ తరగతి చదువుతున్న మా అమ్మాయి చెప్పింది .ఏ పనిలోనైనా బాగా అనుభవం(నైపుణ్యం) కలిగిన వారిని నిపుణులు అంటారు.

నొ:నొప్పి
 అంటే బాధ.శరీరానికీ, మనసుకీ కలుగుతుంది.ఎవరినీ నొప్పించకండి.నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ

నో:నోరు
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.నోటిని తినడం లోనూ మాట్లాడడంలోనూ కూడా అదుపులో ఉంచుకోవాలి.
నోరా వీపుకి తేకే అంటారు.అంటే నోటితో తప్పుగా మాట్లాడితే వీపుకి దెబ్బలు తగులుతాయి.

నౌ:నౌక
    సముద్రంలో నౌకాయానం భయం లేకపోతే బాగుంటుంది.
రోదసిలోకి వాహక నౌకలు వెళతాయి.ఒకప్పుడు వాణిజ్యం నౌకల ద్వారానే.

నం:నంది
శివుని వాహనం నంది.నందీశ్వరుడి శాపం వలనే రావణాసురునికి కోతులతో ముప్పు కలిగింది.

పిల్లలకి గుణింతపు కబుర్లు నచ్చుతాయి.చెప్పి చూడండి.


. ప గుణింతపు పలుకులు

  ప:పలుకు
   మాట.పలుకులు మధురమైతే చిలుక పలుకులు అంటారు.లేకుంటే ములుకులవలె గుచ్చుతాయి.
పలికెడిది భాగవతమట 
పలికించెడి వాడు రామభద్రుడట
 ఇంకొకరికి
 పలుకే బంగార
మాయెనా కోదండపాణీ

పా:పాట
 గానం.పిల్లలకు నచ్చేది జోలపాట.
పాటలు రాని వాళ్ళు ఉండరు.ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది.

పి:పిలుపు
అందుకో పిలుపు గొంతు శృతి కలుపు వందేమాతరం
చేయికలగలుపు నీదె తుదిగెలుపు వందేమాతరం
పిలుపుకి అంత శక్తి ఉంది

పీ:పీడనం
 వత్తిడి.అల్ప పీడనం అంటే తుఫాను వస్తుందని.
పీడించుకు తింటున్నాడురా బాబూ అని బాధ పడతారు.

పు:పులుపు
 ఆరు రుచులలో ఒకటి.
అందని ద్రాక్ష పుల్లన అంటారు.

పు:పువ్వు
పూజకీ కావాలి.అతివల అలంకరణకీ కావాలి.
నేనొక పూల మొక్కకడ నిల్చి.....ఏమిటి?పుష్పవిలాపం.
వింటాం అయినా పెట్టుకుంటాం.సౌభాగ్యానికి చిహ్నం మరి.  పువ్వులు పెద్దమనసుతో క్షమించాలి.

పూ:పూజ
భక్తిని ప్రకటించే మార్గం.
పదినిముషాలైన ఈ జీవితం ప్రసాదించిన భగవంతునికి కేటాయించడం పూజ పరమార్ధం.

పృ:పృధ్వి
అంటే భూమి.
ఫృధ్వీరాజ్ చౌహాన్ అనే గొప్ప రాజపుత్ర రాజు ఉండేవాడు.

పె:పెళ్ళి
ఇద్దరు మనుషుల్ని,రెండు కుటుంబాలనీ కలిపేది.
పెళ్ళంటె పందిళ్ళు,సందళ్ళు,తప్పెట్లు,తాళాలు,తలంబ్రాలు..
మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు

పే:పేదరికం
తినడానికి సరిపడ తిండి,కట్టుకోడానికి చాలినన్ని దుస్తులు,ఉండడానికి ఇల్లు లేకపోవడం.

పై:పైసా,పైకం
పైసాయే పరమాత్మ అనేవారొకప్పుడు.ఇప్పుడు పైసలకి విలువ లేదండోయ్.
పైకం కావాలి.పైకంతోనే లోకం నడుస్తోంది.

పొ:పొరపాటు
ఇది అందరూ చేస్తారు. ఒప్పుకుని పొరపాటు దిద్దుకోవడమే గొప్పదనం.

పో:పోరు
పోరు నష్టం పొందు లాభం అన్నారు.
దెబ్బలాడుకుని నష్టపోకండి ,కలిసి ఉంటే కలదు సుఖం అన్నమాట.

పౌ:పౌరుషం
పలనాటిలో వారికే కాదండీ మనకీ ఉంది పౌరుషం.
పరుషంగా మాట్లాడితే పౌరుషం రాదా మరి.

పం:పంచుకో
కష్టం పంచుకుంటే తగ్గుతుంది.సుఖం పంచుకుంటే పెరుగుతుంది.

 సరదాగా ముగించనా?కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం అంటే అరలీటరో ,లీటరో పాలు పట్టికెళ్ళి పంచకండి  
కష్టపడేవారికి మాటసాయమో,చేతలతో సాయమో చెయ్యండి.సుఖపడే వాళ్ళని చూసి సంతోషపడండి.

      టాటా గిడిగిడీ
బై శ్రీమతి రేగులగెడ్డ వెంకట లక్ష్మీ గాయత్రి


INTRODUCTION OF SRIMATHI REGULAGEDDA VENKATA LAKSHMI GAYATHRI IN BHAVUKA FACEBOOK GROUP


భావుక సభ్యులకి శుభోదయం.

నూతన సంవత్సరంలో తిరిగి ఆరంభించిన గొలుసు కధ రచనలు చేసిన.. శ్రీ ఇంద్రగంటి వేంకట సుబ్బారావు గారికి, శ్రీ గోటేటి విశ్వనాధం గారికి, శ్రీమతి. శ్రీ దేవత గారికి, శ్రీమతి నాగ అయ్యల గారికి కృతజ్ఞతలు, అభినందనలు.. అందరూ వారి వారి శైలిలో.. చక్కగా సాగించారు.

మరి కాసేపట్లో.. ఈ కధ ముగింపు భాగం.. వస్తుంది.

 గొలుసు కధ.. ఆఖరి భాగం.. ఇదే ముగింపు భాగం.. 
ఈ కధా భాగం వ్రాసినవారు..  శ్రీమతి లక్ష్మి గాయత్రి గారు. వీరు భావుక లో ప్రత్యక్ష సభ్యులు కారు. వీరు పరోక్ష సభ్యులు. 
ఇద్దరి స్నేహితురాళ్ళ స్వప్నమే.. ఈ భావుక కదా.. అది మనందరికీ తెలుసు. వారిద్దరి భావనలూ.. అభిరుచులు.. ఏకరూపమై.. భావుక రూపొందించబడింది. 
అలాగే మరో ఇద్దరి స్నేహితురాళ్ళ గురించి తెలుసుకుందాం. ఒకరు మన భావుక సభ్యురాలైన Parvathi Kala.. మరొకరు వీరి స్నేహితురాలు శ్రీమతి లక్ష్మి గాయత్రి  గారు. 
రచనల పట్ల ఆసక్తి, అభిరుచి వున్న గాయత్రి గారు.. ఇంటి పరిస్ధితులు, ఇబ్బందుల, ఇంటి బాధ్యతలు.. కారణంగా ఫేస్బుక్ అలవాటు అవలేదు. అయితే భావుక సభ్యురాలైన పార్వతి గారు.. తన స్నేహితురాలిలో వున్న.. రచనా నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తూ.. ఆవిడ ఫోన్ లో తన రచనలని చెపుతూవుంటే.. ఈవిడ వాటిని భావుక లో పంచేవారు. అలాగ వారి చిన్న చిన్న రచనలు భావుక లో వస్తూ వున్నాయి. ఇప్పుడు ఈ గొలుసు కధ వ్రాయడంలో తన స్నేహితురాలికి అవకాశం ఇవ్వమని పార్వతిగారు అడగడంతో.. నేను సదరు గాయత్రి గారితో మాట్లాడినప్పుడు... ఆవిడ గురించి తెలిసింది. తెర వెనక వుండి పోయిన మంచి రచనా పటిమ కలిగిన వ్యక్తి అని అనిపించింది. అవకాశం వస్తే.. వారు మంచి పేరు తెచ్చుకోగలరు అనిపించి.. మన భావుక సభ్యులు కాకపోయినప్పటికీ ఆవిడకి ఈ అవకాశం ఇవ్వడం  జరిగింది. 
శ్రీమతి లక్ష్మి గాయత్రి గారు తనని మనకిలా పరిచయం చేసుకుంటున్నారు.. 
ఇప్పుడు ఈ కధ పార్వతి గారి పేరుతో.. భావుక లో పోస్టు చేయబడుతుంది.. గమనించగలరు. 

నా పేరు రేగులగెడ్డ వెంకట లక్ష్మీ గాయత్రి.
నా విద్యార్హతలు:B.sc(biological science)
,B.Ed Andhra university
M.A.Hindi(Chowdary charansingh university)Meerut
Diploma in  translation studies(central university)
మా నాయనమ్మగారి నుంచి వారసత్వంగా కొద్దిపాటి జ్యోతిష్యం అబ్బింది.
టైపు కూడా 3 భాషలు నేర్చుకున్నాను.
వివాహమునకు ముందు కేవలం బ్యాచిలర్  డిగ్రీ మాత్రమే వుంది. 😃
వివాహం తరువాత మాష్టర్ ని  M.A.,టీచర్ ని B.Ed.అయ్యాను.
మావారు శ్రీ గరిమెళ్ళ రామలింగేశ్వర శర్మ గారు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నారు.
మా అత్తమామలు వృధ్ధులగుట చేత మావారి మాటకి లోబడి ఉద్యోగం చేయడం లేదు.మామగారు పరమపదించి 4సంవత్సరములు అయినది.బాధ్యతల కారణంగా ఆలస్యంగా మా పాప అంజనా సాత్త్విక పుట్టింది. అత్తగారి వ యస్సు87 సంవత్సరాలు.అందుకే నేను స్వయంగా  భావుకలో ఉండలేక పోతున్నాను.🙏🙏క్షమించాలి.
మీ ముందుకు రావడానికి కారణం మా పార్వతి.తనకి🙏



No comments:

Post a Comment

KNOWLEDGE ABOUT TAX PAYMENT

GVMC WEBSITE gvmc.gov.in

GVMC relaunch its website gvmc.gov.in ON 10-11-2018 please visit the site and offer remarks GVMC introduced Apartments association regi...